మార్చి 6  నుంచి బషీర్ ఫారం రైల్వే గేటు బంద్​

మార్చి 6  నుంచి బషీర్ ఫారం రైల్వే గేటు బంద్​

ఎడపల్లి, వెలుగు : మండలంలోని బషీర్​ ఫారం రైల్వే గేటును ఈ నెల 6 నుంచి మూసి వేస్తున్నట్లు శుక్రవారం ఎడపల్లి పోలీస్​ స్టేషన్​లో నోటీసు అందజేసినట్లు సికింద్రాబాద్​ డివిజన్​ రైల్వే ఇంజినీర్ తెలిపారు.  రైల్వే గేటు వద్ద అండర్​ పాస్​ నిర్మిస్తున్నందున గేటు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రయాణానికి ఇబ్బంది అవుతుందని ఇదివరకు పోచారం గ్రామస్తులు తీవ్రంగా వ్యతి రేకించగా, గేటు మూసివేతను విరమించారు. మళ్లీ అండర్​ పాస్​ నిర్మాణం పేరుతో మార్గాన్ని మూసివేస్తున్నారు.