
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ఎడవల్లి కృష్ణతో పాటు పలువురు నాయకులు సొంతగూటికి చేరుకున్నారు. చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గాంధీ భవన్లో శుక్రవారం జిల్లాలోని పలువురు నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఎడవల్లి కృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, వారంతా లోక్ సభ ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్లో కి వచ్చారు. పార్టీలో చేరినవారిలో రాయల శాంతయ్య, మల్లికార్జున్, వీరయ్య చౌదరి, పల్లపు వెంకట్, బీ. శ్రీనివాస్, బీఎన్ చారితో పాటు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు చెందిన పలువురు నాయకులు ఉన్నారు.