ఇంజినీరింగ్ విద్యలో క్వాలిటీ పెంపునకు సహకరించండి

ఇంజినీరింగ్ విద్యలో క్వాలిటీ పెంపునకు సహకరించండి
  • ఏఐసీటీఈ, యూజీసీ చైర్మన్లకు టీజీసీహెచ్ఈ వినతి

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ విద్యలో క్వాలిటీ పెంపునకు సహకరించాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి కోరారు. ఢిల్లీలో యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్, ఏఐసీటీఈ చైర్మన్ టీజీ సీతారామ్ ను కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్​తో పాటు లింబాద్రి కలిశారు. తెలంగాణలో ఏటా లక్ష మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యలో అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు.

కానీ వారిలో కేవలం 20 శాతం మాత్రమే క్వాలిటీతో బయటకు వస్తున్నారని చెప్పారు. ఇండ్రస్టీ రిక్వైర్​మెంట్​కు అనుగుణంగా క్వాలిటీ పెంచేలా తమకు సహకరించాలని కోరారు. అడిషనల్ సీట్ల కోసం ప్రతిపాదనలకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తుందని, దీనివల్ల రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

పీహెచ్​డీ అడ్మిషన్ల ప్రక్రియలోని సమస్యలతో పాటు బార్ కౌన్సిల్ వద్ద పెండింగ్ లో ఉన్న మూడు లా కాలేజీల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. త్వరలోనే ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్​పై, ఉపాధి అవకాశాలపై ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో ఏర్పాటు చేసే సమావేశానికి రావాలని యూజీసీ, ఏఐసీటీఈ చైర్మను ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించారు.