![స్కూల్ ఎడ్యుకేషన్ బలోపేతానికి ఎన్జీవోల సహకారం : విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా](https://static.v6velugu.com/uploads/2025/02/education-secretary-yogitharana-conducts-n-g-vos-consultative-meeting-at-mcrhr_tZvFX1juP2.jpg)
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ బలోపేతానికి ఎన్ జీవోల సహకారం తీసుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. ప్రస్తుతం ఈ రంగంలో సేవలు అందిస్తున్న వారంతా ఎవరెవరు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారు.. ఎలా విస్తరించాలనుకుంటున్నారనే వివరాలను ఒక ఫార్మాట్ లో ఇవ్వనున్నట్టు చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించించేలా సూచనలు ఇస్తానని పేర్కొన్నారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎన్ జీవోఎస్ కన్సల్టేటివ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశానికి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన యోగితా రాణా మాట్లాడుతూ... ఎన్ జీవోలు మంచి ఫలితాలను చూపిస్తే, అవసరాన్ని బట్టి రాష్ట్రవ్యాప్తంగా వారి పనిని విస్తరించి, ప్రభుత్వం నుంచి మద్దతు అందిస్తామని చెప్పారు. ఎన్జీవోలందరినీ సమన్వయం చేసేందుకు ఎన్జీఓ కనెక్ట్ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు.