
పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల ఆలయ 52 రోజుల హుండీ ఆదాయం రూ. 47,33,787 వచ్చినట్లు గురువారం ఈ వో చంద్రశేఖర్, సహాయ కమిషనర్ అంజలీదేవి తెలిపారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హుండీని లెక్కించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.