దుర్గమ్మా.. దీవించమ్మా

దుర్గమ్మా.. దీవించమ్మా

ఏడుపాయ వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర పాయల్లో పుణ్య స్నానాలు చేసి దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అనంతరం అమ్మకు ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీనివాస్​గౌడ్​బందోబస్తు నిర్వహించారు.- పాపన్నపేట, వెలుగు