
జూబ్లీహిల్స్/ముషీరాబాద్/బషీర్బాగ్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన పాలసీని తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని మంత్రి సీతక్క తెలిపారు. ది జూబ్లీహిల్స్కో-ఆపరేటివ్హౌసింగ్సొసైటీ లిమిటెడ్ఆఫీసులో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం, వైద్యం,అభివృద్ధి, వేతనాలపై సీఎం రేవంత్రెడ్డితో చర్చించి కొత్త పాలసీ తీసుకు రావడానికి కృషి చేస్తానన్నారు. మహిళా జర్నలిస్టులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు.
పాత్రి కేయుల కోసం సొసైటీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సొసైటీ అధ్యక్షుడు గోపరాజు మంత్రికి వివరించారు. అనంతరం సీనియర్ మహిళా జర్నలిస్టులను మంత్రి సత్కరించారు. ప్రెస్అకాడమీ మాజీ అధ్యక్షుడు దేవుల పల్లి అమర్, సొసైటీ కార్యదర్శి రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ మసాదె, సంయుక్త కార్యదర్శి డాక్టర్చల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారి భీమగాని మహేశ్వర్గౌడ్, సభ్యుడు కమలాకరచార్య తదితరులు పాల్గొన్నారు. దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవ క్రీడ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
కాంగ్రెస్అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, శాట్స్చైర్మన్శివసేనారెడ్డి, టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. టీజీఓ మహిళ విభాగం నేతలు డాక్టర్ దీపారెడ్డి, సుజాత, శిరీష పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో తెలుగు వర్సిటీలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాష్ట్ర సంస్కృతి కళాసారథి చైర్మన్ వెన్నెల పాల్గొన్నారు. బీఎన్ఐ క్యాపిటల్ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ దక్కన్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా అర్గలా హెల్త్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ ప్రతినిధి డాక్టర్శ్రీదేవి యాడవల్లి పాల్గొన్నారు.