తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దం..

తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దం..

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ గత నెల 13న జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు జూన్ 4 అనగా రేపు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు .. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్లు తెలిపారు. జూన్ 4 అనగా మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా 525 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలు..

  •  రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
  •  120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
  • 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుల్స్ సిద్ధం
  •  ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కింపు
  • చొప్పదండి, దేవరకొండ, యాఖత్ పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం
  • ఓట్ల లెక్కింపునకు సుమారు 10 వేల మంది సిబ్బంది నియామకం
  • మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, మద్యం దుకాణాలు బంద్
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు