
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అంతా జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏడో దశ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు రెండు రోజుల ముందే ప్రారంభం అయ్యింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియటంతో కౌంటింగ్ ముందే ప్రారంభించింది ఎన్నికల సంఘం.
పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, సిక్కింలో అధికార ఎస్ కే ఎం పార్టీ 28స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీ పార్టీ 10 సీట్లు గెలుపొంది 23స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 8స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది.