విశ్వ హిందూ రక్షా పరిషత్  కమిటీల ఎన్నిక

విశ్వ హిందూ రక్షా పరిషత్  కమిటీల ఎన్నిక

పంజాగుట్ట, వెలుగు : దేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని విశ్వహిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షుడు గోపాల్​ రాయ్​ అన్నారు. సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో శనివారం సంస్థ జాతీయ, రాష్ట్ర కమిటీలను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

మహిళా విభాగం జాతీయ అధక్షురాలిగా యమునా పాఠక్, రాష్ట్ర విభాగం అధ్యక్షురాలిగా దొంతి శిల్పారెడ్డి,  హైదరాబాద్​అధ్యక్షురాలిగా ప్రసన్న, నగర అధ్యక్షుడిగా మల్లేశ్​ను ప్రకటించారు.