
ఆంధ్ర ప్రదేశ్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేస్తుంది రాజస్థాన్ ఎలక్ర్టానిక్స్ అండ్ ఇన్స్ర్టుమెంట్స్ లిమిటెడ్ (REIL).. ఇందుకు గాను ఓ ప్రకటన చేసింది. ఏపీ రెన్యువబుల్ ఎనర్జీ కార్పొరేషన్ REIL సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ మొత్తంలో 32 చోట్ల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.