
పెబ్బేరు, వెలుగు : పట్టణంలో ప్రమాదవశాత్తు షాట్సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ షాపు కాలిపోయింది. ఏఎంసీ చైర్పర్సన్ ప్రమోదిని కొడుకు యుగంధర్ రెడ్డికి చెందిన ఎలక్ర్టికల్ షాపులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత షార్ట్ సర్క్యూట్ జరిగింది. షాపు ఎదురుగా పుచ్చకాయలు అమ్మేవారు నిద్రిస్తున్న సమయంలో కాలుతున్న వాసన వచ్చి లేచి చూశారు. దీంతో ఓనర్లకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు.
వెంటనే ఓనర్లు ఫైరింజన్కు సమాచారం ఇవ్వగా వారు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు. కాని అప్పటికే షాపులో సామగ్రి కాలిపోయింది. 3 రోజుల క్రితమే షాపులో కొత్త స్టాకు పెట్టినట్లు తెలిపారు. సుమారు రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.