ఆగష్టు 29న ఎలక్ట్రికల్ ఎక్స్‌‌‌‌పో

ఆగష్టు  29న ఎలక్ట్రికల్ ఎక్స్‌‌‌‌పో

హైదరాబాద్, వెలుగు: తాము నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ ఎక్స్‌‌‌‌పో ఐదో ఎడిషన్‌‌‌‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ నెల 29న హైదరాబాద్​లోని హైటెక్స్​లో ప్రారంభిస్తారని సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది. ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, సీఐఐ చైర్మన్​ శేఖర్ రెడ్డి చైర్మన్,  క్రెడాయ్​ హైదరాబాద్ ప్రెసిడెంట్​రాజశేఖర్ రెడ్డితోపాటు   అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  

ఈ మూడు రోజుల ఎక్స్‌‌‌‌పోలో అత్యాధునిక ఎలక్ట్రికల్​ టెక్నాలజీలను, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. పర్యావరణానికి అనుకూలమైన, తక్కువ కరెంటును వాడుకునే ప్రొడక్టులను ఈ సందర్భంగా లాంచ్​ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.   పారిశ్రామిక  వినియోగదారుల  కోసం 200లకుపైగా స్టాల్స్​లో ప్రొడక్టులను ప్రదర్శిస్తారు.