ఈసారి ట్రంప్​ గెలవకుంటే అంతే: ఎలాన్ మస్క్​సంచలన కామెంట్స్

ఈసారి ట్రంప్​ గెలవకుంటే అంతే: ఎలాన్ మస్క్​సంచలన కామెంట్స్
  • అమెరికాలో ఇవే చివరి ఎన్నికలవుతాయ్​
  • ఎలాన్ మస్క్​సంచలన కామెంట్స్​

పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై టెస్లా అధినేత, ‘ఎక్స్’ యజమాని ఎలాన్​మస్క్​ సంచలన కామెంట్స్​ చేశారు. ఈసారి అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి ట్రంప్​ గెలవకపోతే ఇక అంతేనని అన్నారు. 

లేదంటే అమెరికాలో ఒకే ఒక్క పార్టీ మిగులుతుందని, ఇక భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని పేర్కొన్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే డొనాల్డ్​ట్రంప్​ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. 

 ట్రంప్​కు మాత్రమే ఓటేయాలని తెలిసినవారికి, తెలియనివారిని ప్రోత్సహించాలని, లేకుంటే వారికి ఇక ఓటు వేసే అవకాశమే ఉండదని చెప్పాలని ప్రజలకు సూచించారు. ఈ ఏడాది జులైలో పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. 

తాజాగా, ట్రంప్​ అదే ప్రాంతంలో మరో ప్రచార సభ నిర్వహించారు. ఇందులో  ట్రంప్​తో కలిసి మస్క్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మస్క్​ మాట్లాడారు. అమెరికన్లకు జీవితకాలంలోనే ఇవి ముఖ్యమైన ఎన్నికలు అని చెప్పారు.