విమానంలో గుండెపోటుతో మహిళ మృతి

విమానంలో గుండెపోటుతో మహిళ మృతి
  • శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్, వెలుగు: విమాన ప్రయాణంలో ఉన్న ఓ మహిళ గుండెపోటుతో చనిపోయింది. ఖతార్​ రాజధాని దోహా నుంచి బంగ్లాదేశ్​కు వెళ్తున్న విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున క్యూఆర్​642 ఫ్లైట్​ దోహా నుంచి బంగ్లాదేశ్  బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత విమానంలో బంగ్లాదేశ్‌‌‌‌కు చెందిన బేగం రోషనారా (44) కు గుండెపోటు రావడంతో వెంటనే సిబ్బంది పైలట్​కు సమాచారం ఇచ్చారు. 

పైలట్​ శంషాబాద్ ఏటీసీకి సమాచారం అందించి, చికిత్స కోసం అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. రోషనారాను వెంటనే శంషాబాద్  ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఆ మహిళ వెంట ఆమె కుమారుడు ఉన్నాడు. మహిళా మృతి చెందిన విషయాన్ని అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.