శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో తప్పిన పెను ప్రమాదం.. కొంచముంటే..

శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో తప్పిన పెను ప్రమాదం.. కొంచముంటే..

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మంగళవారం (ఫిబ్రవరి 18) బ్లూ డార్ట్ కార్గో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తోన్న క్రమంలో కార్గో ఫ్లైట్ ల్యాండింగ్ గేర్‎లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‎కు అనుమతి ఇవ్వాలని కోరాడు. ఇతర విమానాలను ఆపి వెంటనే కార్గో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్‎కు శంషాబాద్ ఏటీసీ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. 

Also Read :- ఔటర్ రింగ్ రోడ్పై వెళుతున్నారా..? జాగ్రత్త..!

దీంతో కార్గో విమానం ఎయిర్ పోర్టులో సేఫ్‎గా ల్యాండ్ అయ్యింది. నిత్యం ప్రయాణీకుల రద్దీతో హడావుడిగా ఉండే శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు, ఎయిర్ లైన్స్ సంస్థ ఊపిరి పీల్చుకుంది.  విమానం ల్యాండ్ అయిన అనంతరం రంగంలోకి దిగిన అధికారులు ఫ్లైట్‎లో సాంకేతిక సమస్య తలెత్తడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు