
- ఎన్ డీఎస్ఏకి ఈఎన్సీ జనరల్ లేఖ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్లంజ్పూల్గొయ్యికి వీలైనంత త్వరగా రిపేర్లు చేయించాలని నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)ని ఈఎన్సీ జనరల్అనిల్కుమార్కోరారు. 2009లో వచ్చిన వరదలతో ప్రాజెక్టు ప్లంజ్పూల్లో భారీ గొయ్యి పడిందని, అది మరింత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఎన్ డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాశారు. గొయ్యిని పూడ్చేందుకు ఏపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండడంతో అది ప్రమాదకర స్థాయికి చేరుకుందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
ప్లంజ్పూల్ ఏరియా కింద రాతి పగుళ్లు నెమ్మదిగా డ్యామ్పునాదుల వైపు విస్తరిస్తున్నాయని, అది మొత్తం డ్యామ్నే ప్రమాదంలో పడేసే ముప్పు ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన నిపుణులు ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చారని గుర్తు చేశారు. గొయ్యిని ఇలాగే వదిలేస్తే డ్యామ్ కూలి ఏపీలోని ప్రాంతాలు మునగడంతో పాటు నాగార్జునసాగర్డ్యామ్తో పాటు పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.