
హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్గా శ్రీనివాసరావు నియమితులయ్యారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీనివాసరావు ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ సభ్యుడిగా కొనసాగారు. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్గా కొనసాగుతున్న కూరాకుల జ్యోతి నియమితులయ్యారు.
దేవాదాయ శాఖలో ముగ్గురు అదనపు కమిషనర్లు ఉంటారు. ఇద్దరు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఒకరు ట్రైబ్యునల్ సభ్యుడిగా కొనసాగుతారు. రోటెషన్ పద్ధతిలో మూడేళ్లకొకసారి మారుతుంటారు. ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్గా జ్యోతి బాధ్యతలు చేపట్టిన మూడేండ్లు పూర్తి కావడంతో శ్రీనివాసరావు స్థానానికి పంపించారు.