రిజల్ట్స్ రాకముందే సూసైడ్.. 892 మార్కులతో ఏ గ్రేడ్​లో పాస్

రిజల్ట్స్ రాకముందే సూసైడ్.. 892 మార్కులతో ఏ గ్రేడ్​లో పాస్

కేసముద్రం (మహబూబాబాద్ ​అర్బన్​), వెలుగు: ఫెయిల్ అవుతాననే భయంతో రిజల్ట్స్ రాకముందే సూసైడ్​ చేసుకున్న ఇంటర్​స్టూడెంట్​ 892 మార్కులతో ‘ఏ’ గ్రేడ్​లో పాసయ్యాడు. ఈ ఘటన మృతుడి కుటుంబ సభ్యులను తీవ్ర వేదనకు గురిచేసింది. మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం బోడగుట్ట తండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతి దంపతుల పెద్ద కొడుకు కృష్ణ (19) ఏటూరు నాగారంలోని గిరిజన గురుకుల కాలేజీలో ఇంటర్​( బైపీసీ) పూర్తిచేశాడు. గత నెల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు.

 చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్​ చేయాలన్న కోరికతో కష్టపడి చదువుతున్నాడు. అయితే, పరీక్ష బాగా రాయలేదని, ఫెయిల్​ అవుతానని, దాంతో ఎంబీబీఎస్​ చేయలేనని ఆవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌‌‌‌ 10న..  ‘‘అమ్మ, నాన్న క్షమించండి, నాకు ఎంబీబీఎస్​లో సీటు రాదు.. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అని సూసైడ్​ లెటర్​ రాసి ఉరి వేసుకొని చనిపోయాడు. మంగళవారం రిలీజ్​ అయిన ఇంటర్‌‌‌‌ ఫలితాల్లో కృష్ణ  1000  మార్కులకు 892 మార్కులు సాధించి ఏ గ్రేడ్‌‌‌‌లో పాసయ్యాడు. దీంతో కృష్ణ తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరయ్యారు.