
- సీఎస్, డీవోలను విధుల నుంచి తప్పించిన ఆఫీసర్లు
- ఇన్విజిలేటర్ సస్పెన్షన్, స్టూడెంట్ డిబార్
నల్గొండ/నకిరేకల్, వెలుగు: నల్గొండ జిల్లా నకిరేకల్ ఎస్సీ గురుకుల పాఠశాలలో తెలుగు పేపర్ లీకైన వ్యవహారంపై ఎంక్వైరీ షురూ అయింది. ఎగ్జామ్ పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, నకిరేకల్ ఎంఈవో నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బార్ కోడ్ ఆధారంగా నకిరేకల్లోని ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి లీకైనట్లు గుర్తించారు. గోడ దూకి వచ్చిన వ్యక్తి పరీక్ష హాల్ కు వెళ్లి ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసినట్లు విచారణలో తేల్చారు.
ఎగ్జామ్ సెంటర్ సీఎస్ గోపాల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రామ్మోహన్ రెడ్డిని పరీక్ష విధుల నుంచి తప్పించగా, ఇన్విజిలేటర్ సుధారాణిని సస్పెండ్ చేశారు. స్టూడెంట్ను డిబార్ చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు, విద్యా శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నాపత్రం ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు
వినిపిస్తున్నాయి.