
కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నాలుగు రోజులు బంద్ ఉంటుందని మార్కెట్ సెక్రటరీ సంగయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జనవరి 13 నుంచి 16 వరకు మార్కెట్యార్డు బంద్ ఉంటుందన్నారు. తిరిగి 17న ఓపెన్ అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.