మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం టెంపుల్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహా కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో మారుతి తెలిపారు.
గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడతూ.. ఉదయం 6 గంటలకు త్రివేణీ సంగమం నుంచి పవిత్ర జలాలు తీసుకురావడంతో కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. మూడురోజులపాటు ఆచ్చలాపురం నుంచి 50 మంది వేదపండితులు రానున్నారని తెలిపారు. 9 న మహా కుంభాభిషేకం తుని పీఠాదిపతి సచ్చిదానంద సరస్వతి చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు.