
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ మెంబర్లు ఇక నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్నంబర్ (యూఏఎన్)ను తీసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం తెలిపారు. ఉమంగ్ మొబైల్ యాప్ని ఉపయోగించి ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్ఏటీ)తో నేరుగా యూఏఎన్ని పొందవచ్చని ఆయన తెలిపారు.
ఉద్యోగి కోసం ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్ఏటీ)ని ఉపయోగించి యూఏఎన్ని రూపొందించడానికి యజమాని కూడా ఉమంగ్ యాప్ని ఉపయోగించవచ్చు. యూఏఎన్ని రూపొందించడానికి, ఉద్యోగి ఉమంగ్ యాప్ని తెరిచి, ఫేస్రికగ్నైజేషన్ ద్వారా యూఏఎన్ అలాట్మెంట్ ఆప్షన్పై క్లిక్చేయాలి. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తర్వాత, ఆధార్ డేటాబేస్లోని మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్చేస్తే యూఏఎన్ క్రియేట్అవుతుంది. ఉమంగ్ యాప్ లేదా సభ్యుల పోర్టల్ నుంచి యూఏఎన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.