
- ప్రయాస్ పథకం ద్వారా పెన్షన్ చెల్లింపు
పటాన్చెరు, వెలుగు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పటాన్చెరు కార్యాలయ ఆధ్వర్యంలో ప్రయాస్ పథకం ద్వారా పదవి విరమణ చెందిన వారికి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ లను పంపిణీ చేశారు. గురువారం పాశమైలారం అరబిందో ఫార్మ కంపెనీలో నిధి ఆప్కె నికట్ కార్యక్రమాన్ని ఈపీఎస్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ నెలలో పదవీ విరమణ పొందిన 15 మందికి పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను అందజేశారు.
. ఈ సందర్బంగా ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రయాస్ పథకం ద్వారా ఈపిఎస్ చందాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ఈపీఎస్ఓ సభ్యులకు పదవీ విరమణ పొందిన నెలలోనే పెన్షన్ ప్రయోజనాలను మంజూరు చేసేందుకు సులభతరం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆర్. శ్రీదేవి,- హెచ్ఆర్ హెడ్ డాక్టర్ రాజు, అరబిందో ఫార్మా, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ ఏ. పెద్ది రాజు అకౌంట్స్ ఆఫీసర్ అబ్దుల్ అజీమ్ పాల్గొన్నారు.