![రాధాకిషన్రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు](https://static.v6velugu.com/uploads/2024/07/escort-bail-granted-to-radhakishan-rao_Qn18274Tud.jpg)
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న రాధా కిషన్రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. 2024 జులై 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. రాధాకిషన్రావు తల్లి నెల మాసికంలో పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. రాధాకిషన్రావు తల్లి పొట్లపల్లి సరోజనాదేవి గత నెల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.