కేంద్ర మంత్రి సంజయ్​తో ఎస్సార్ జితేందర్ రెడ్డి భేటీ

కేంద్ర మంత్రి సంజయ్​తో ఎస్సార్ జితేందర్ రెడ్డి భేటీ
  • రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వినతి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను శనివారం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (ఎస్సార్) ఏపీ జితెందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సంజయ్  నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిగా సంజయ్, ఎస్సార్ గా జితేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి నేతలిద్దరూ భేటి అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ నుంచి మంత్రిగా ఉన్నందున రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని జితేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలనైనా తన దృష్టి కి తీసుకురావచ్చని, పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తానని సంజయ్ హామీ ఇచ్చారు.