ఇండియా మార్కెట్లోకి ఎస్సిలార్ ​నుంచి జెన్​ఎస్​ లెన్సులు

 ఇండియా మార్కెట్లోకి  ఎస్సిలార్ ​నుంచి జెన్​ఎస్​ లెన్సులు

హైదరాబాద్​, వెలుగు: ప్రీమియం కళ్లద్దాల బ్రాండ్ ఎస్సిలార్​ ట్రాన్సిషన్​ జెన్​ఎస్​ లెన్సులను ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టింది.  అల్ట్రా- రెస్పాన్సివ్ లైట్ అడాప్టేషన్‌‌ వల్ల అద్దాలు సెకన్లలో చీకటిగా మారుతాయి.

 రెండు నిమిషాలలోపు తిరిగి మసకబారుతాయి. వేగంగా కాంతి మారినప్పటికీ కస్టమర్లు గుర్తించలేరని ఎస్సిలార్​ తెలిపింది. బయట ఉన్నా, ఇంటి లోపల ఉన్నా ధరించడానికి   అనువుగా ఉంటాయని పేర్కొంది. ట్రాన్సిషన్ ​జెన్​ఎస్​ లెన్సులు యూవీఏ, యూవీబీ కిరణాలను, బ్లూలైట్​ను ఫిల్టర్ ​చేస్తూ కళ్లను కాపాడుతాయని తెలిపింది. వీటి ధరలు రూ.8,900 నుంచి మొదలవుతాయని పేర్కొంది.