సింగరేణి నాశనానికి కేసీఆరే కారణం : ఎంపీ ఈటల రాజేందర్

సింగరేణి నాశనానికి కేసీఆరే కారణం : ఎంపీ ఈటల రాజేందర్
  • ప్రస్తుతం అదే బాటలో రేవంత్​రెడ్డి సర్కార్​ 
  • మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​ కామెంట్స్

గోదావరిఖని/ హుజూరాబాద్, వెలుగు: సింగరేణి సొమ్మును ఏటీఎంలాగా వాడుకొని సంస్థ నాశనానికి మాజీ సీఎం కేసీఆర్‌‌ కారణమయ్యారని, అదే బాటలో ప్రస్తుత రేవంత్​రెడ్డి సర్కార్​నడుస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​విమర్శించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ శాలపల్లిలోని ఓ ఫంక్షన్​హాల్​లో జరిగిన సమావేశానికి ఆయన హాజరై బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో పదేండ్లు పాలించిన బీఆర్ఎస్​ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో లేకుండా పోయిందన్నారు. గ్రాడ్యుయేట్స్, టీచర్ల సమస్యల పరిష్కారానికి కొట్లాడేది బీజేపీ మాత్రమేనన్నారు. సీఎం రేవంత్​రెడ్డికి దమ్ముంటే 317 జీవోను సవర్తిస్తామని, సీపీఎస్​ను రద్దు చేస్తామని ప్రకటించాలని ఆయన డిమాండ్​ చేశారు. గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి కందుల సంధ్యారాణి, రావుల రాజేందర్, బల్మూరి వనిత, మెరుగు హన్మంత్​గౌడ్​, బీఎంఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి,  సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.