
- 30 నుంచి 50 పడకలకు పెంపు
ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిని 50 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఏటూరునాగారం కమ్యూనిటీ హెల్త్సెంటర్ను 30 పడకల నుంచి 50 పడకలకు అప్గ్రేడ్ చేయాలని గతంలో పలుమార్లు ప్రభుత్వాన్ని స్థానిక లీడర్లు అభ్యర్ధించారు.
ఈ క్రమంలో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో రాష్ట్ర హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్పస్త్రర్ సెక్రెటరీ క్రిస్టియాన జడ్చోంగ్తు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయడానికి సివిల్వర్క్స్, పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం రూ.22 కోట్లను కేటాయిచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిటమట రఘు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి ఏటూరునాగారం మండల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్న మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.