డాక్టర్ రెడ్డీస్ క్యాన్సర్ డ్రగ్​కు ఈఎంఏ ఓకే

డాక్టర్ రెడ్డీస్ క్యాన్సర్ డ్రగ్​కు ఈఎంఏ ఓకే

హైదరాబాద్​: యూరప్ మార్కెట్లలో ​తమ బయోసిమిలర్ క్యాన్సర్​ డ్రగ్​ రిటుక్సిమాబ్ క్యాండిడేట్​ను అమ్మడానికి యూరోపియన్​ మెడిసిన్స్​ ఏజెన్సీ (ఈఎంఏ) సానుకూలంగా స్పందించిందని  హైదరాబాద్​ ఫార్మా కంపెనీ డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ప్రకటించింది. ఈఎంఏ అభిప్రాయాన్ని యూరోపియన్ కమిషన్ సమీక్షిస్తుంది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల్లో మార్కెటింగ్ ఆథరైజేషన్​పై నిర్ణయం తీసుకుంటారు. 

యూరోపియన్ ఎకనామిక్ ఏరియా సభ్య దేశాలైన నార్వే, ఐస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్,  లీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టెయిన్​లకూ ఈ నిర్ణయం వర్తిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ గతంలో రిటుక్సిమాబ్ డ్రగ్​సబ్​స్టెయిన్స్​కు ఈయూ జీఎంపీ సర్టిఫికెట్ పొందింది.