
హైదరాబాద్, వెలుగు: కళాశాల, సాంకేతిక విద్యా శాఖలకు ఇన్చార్జ్ కమిషనర్గా ఈవీ నర్సింహారెడ్డిని సర్కారు నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుత కమిషనర్గా ఉన్న శ్రీదేవసేన ఈనెల 6 నుంచి 25 వరకు సెలవులో వెళ్లారు. దీంతో ఆమె వచ్చే వరకు ఆయా బాధ్యతలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్న నర్సింహారెడ్డికి అప్పగించారు. సెలవులోంచి తిరిగి రాగానే.. శ్రీదేవసేన తన బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొన్నారు.