కేంద్రం రూ.10 వేల కోట్లు ఇచ్చినా.. ఎన్ఈపీని అనుమతించం.. అమలు చేస్తే తమిళనాడు 2 వేల ఏండ్లు వెనక్కి: స్టాలిన్

కేంద్రం రూ.10 వేల కోట్లు ఇచ్చినా.. ఎన్ఈపీని అనుమతించం.. అమలు చేస్తే తమిళనాడు 2 వేల ఏండ్లు వెనక్కి: స్టాలిన్

చెన్నై:  తమిళనాడులో నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌‌‌‌ఈపీ) అమలు చేస్తే తమ రాష్ట్రం 2 వేల సంవత్సరాలు తిరోగమనం చెందుతుందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్  అన్నారు. ఎన్​ఈపీ విషయంలో స్టాలిన్​ రాజకీయం చేస్తున్నారని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ ఆరోపించిన ఒకరోజు తర్వాత స్టాలిన్​ ఈ మేరకు స్పందించారు. కేంద్రం రూ.10 వేల కోట్లు ఇచ్చినా తమిళనాడు ఈ విధానాన్ని అంగీకరించదని హెచ్చరించారు.

శనివారం కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తమిళ భాషాభివృద్ధికి కేంద్రం కేవలం రూ.74 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం  8 కోట్ల మంది మాట్లాడే సంస్కృతానికి మాత్రం రూ.1,488 కోట్లు కేటాయించారని ఫైర్​ అయ్యారు. శనివారం కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తమిళ భాషాభివృద్ధికి కేంద్రం కేవలం రూ.74 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం  8 కోట్ల మంది మాట్లాడే సంస్కృతానికి మాత్రం రూ.1,488 కోట్లు కేటాయించారని ఫైర్​ అయ్యారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్లే తాము ఎన్ఈపీని వ్యతిరేకించడం లేదని, విద్యార్థుల భవిష్యత్తుపై, సమాజంపై తీవ్ర ప్రభావాలు చూపే  ఇతర అంశాలు కూడా ఉన్నాయని స్టాలిన్​ పేర్కొన్నారు.