
మెదక్ టౌన్, వెలుగు : స్కూళ్లు తెరిచి పదిహేను రోజులు దాటిపోతున్నా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మండిపడ్డారు. మంగళవారం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 విడతలుగా చెల్లిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం మోసం చేయడమేనన్నారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఏరియర్స్ 15 వాయిదాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఆర్సీ కమిటీని నియమించాలని, టీచర్ల ఖాళీలను గుర్తించి డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్కూళ్లలో స్కావెంజర్స్ని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ నేతలు తిరునగిరి నర్సింలు, మాధవరెడ్డి, నవీన్ కుమార్, రమేశ్, మధు మోహన్, సిద్దు, ఆంజనేయులు, సాయిలు, యాదగిరి, దేవేందర్ రెడ్డి, మధు పాల్గొన్నారు.