
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధికార ప్రతినిధిగా సుప్రియా శ్రీనాతే నియమితులయ్యారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా సుప్రియ నియామకానికి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ సమాచార విభాగం ఇన్ఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా చెప్పారు. మాజీ జర్నలిస్టు అయిన సుప్రియ 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని మహరాజ్గంజ్నుంచి పోటీ చేశారు.