138 కేజీల గంజాయిని సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు...

138 కేజీల గంజాయిని సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. పక్కా సమాచారం  మేరకు పాత మార్కెట్ లో తనిఖీలు నిర్వహించిన ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు స్విఫ్ట్ డిజైర్ కార్ లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 138 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఆరెస్ట్ చేసిన అధికారులు కార్,గంజాయిని సీజ్ చేశారు.

ALSO READ | స్పీడ్ తగ్గించాలని అన్నందుకే.. కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన్రు

పట్టుబడ్డ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి నుండి మహారాష్ట్ర కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 37 లక్షల 50 వేల రూపాయలుగా ఉంటుందని తెలిపారు. ఒక సెల్ ఫోన్ ను సీజ్ చేశామని.. గంజాయితో పట్టుబడ్డ వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని.. అతను ఇప్పటికే పలు గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితునిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.