హైదరాబాద్‌‌ లో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ దహనం

హైదరాబాద్‌‌ లో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ దహనం

హైదరాబాద్ సిటీ, వెలుగు:  పలు తనిఖీల్లో  పట్టుబడిన రూ.3 కోట్లు విలువ చేసే డ్రగ్స్, గంజాయిని ఎక్సైజ్‌‌ పోలీసులు దహనం చేశారు. హైదరాబాద్‌‌ లోని ఏడు ఎక్సైజ్‌‌ పోలీస్‌‌ స్టేషన్లలో 219 డ్రగ్స్ పట్టివేత కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సీజ్ చేసిన కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్​బ్లాస్ట్స్, గంజాయి, హాష్​ఆయిల్, పాపిష్టను..సోమవారం రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఈదులపల్లిలో జీకే మల్టికేవ్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ కంపెనీలో దహనం చేశారు. ధూల్‌‌పేట్‌‌ఎక్సైజ్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో 104  కేసులు, జూబ్లీహీల్స్‌‌లో 24 , కాచిగూడలో 6 , మలక్‌‌పేట్‌‌ లో 5 , సికింద్రాబాద్‌‌లో 35, నారాయణగూడలో 23,  ముషీరాబాద్‌‌లో నమోదైన 22 కేసుల్లో పట్టుబడిన డ్రగ్స్‌‌ దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. 

వీటి విలువ రూ.3 కోట్ల మేర ఉంటుందన్నారు.  ఇందులో 756 కిలోల గంజాయి, 1235 కిలోల గంజాయి నుంచి హాష్​ఆయిల్​తీయగా మిగిలిన పిప్పి, 1.315 కిలోల వెట్‌‌ గంజాయి, గంజాయి మొక్కలు, 8 గ్రాముల ఎండీఎంఏ, 10 కిలోల హాష్ ఆయిల్, మరో 10 కిలోల గంజాయి చాక్లెట్లు ఉన్నాయని వివరించారు. గంజాయి విలువ రూ.1.89 కోట్లు, పాపిష్ట విలువ రూ. 62 లక్షలు, 180 గ్రాముల కొకైన్​విలువ రూ.37 లక్షలు, హాష్​ఆయిల్​ రూ.10 లక్షలు, ఎండీఎంఏ, ఎల్​ఎస్​డీ బ్లాస్ట్స్​విలువ రూ.2 లక్షలు కలిపి మొత్తంగా రూ. 3 కోట్ల విలువ చేస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.