బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ బర్త్ డే పార్టీపై ఎక్సైజ్ పోలీసుల రైడ్స్

బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ బర్త్ డే పార్టీపై ఎక్సైజ్ పోలీసుల రైడ్స్

బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ బర్త్ డే పార్టీపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ లోని కాంటినెంట్ రిసార్ట్  లో జూలై 29, 2024  నాడు మహబూబ్ బర్త్ డే పార్టీ నిర్వహించాడు. ఈ సెలబ్రేషన్స్ లో తన ఫ్రెండ్స్ అందర్ని పిలిచి మంచి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు. ఇంతలోనే అక్కడికి పోలీసులు వచ్చారు. ఏంటా అని చూసేలోపల పార్టీ నిలిపివేయాలని సూచించారు. 

ఎందుకని మహబూబ్ అడగగా ఇక్కడ మీరు బర్త్ డే పార్టీ మాత్రమే చేసుకోవాలని అంతే కానీ అనుమతి లేకుండా లిక్కర్ ను తెచ్చుకుని తాగుతున్నారని చెప్పారు. దీంతో బర్త్ డే పార్టీ కోసం అని తెచ్చిన 10 లీటర్ల లిక్కర్, 5 లీటర్ల బీరు బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫంక్షన్ హాల్ యజమాని కొల సుధాకర్, పార్టీ ఆర్గనైజర్ శైక్ సుభని పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 29, 2024 రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఈ పార్టీలో పలువురు సెలబ్రెటీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో గీతూ రాయల్, శ్రీ సత్య, ఢీ ఫేం శ్వేత, రవి, యాంకర్ ధనుష్, సావిత్రి భర్త గంగూలీ, దివ్య శ్రీతో పాటు పలువురు సోషల్ మీడియా ఫేమ్ పొందినవారు ఉన్నట్టు సమాచారం. ఈ పార్టీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు. పార్టీలో ఇంకా ఏమైన నిషేధించిన ద్రవ్యాలు, ఉన్నాయ అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.