
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆదివారం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లక్షకుపైగా సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోనే తెలంగాణ మహిళా కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. దీంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావును అల్కా లాంబ అభినందించారు. సోమవారం గాంధీభవన్లో జరుగనున్న నారీ న్యాయ్ కార్యక్రమంపై కమిటీ చర్చించింది.