Exit Polls: హర్యానాలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే..

Exit Polls: హర్యానాలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే..

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ నిర్వహించారు. 61 శాతం ఓటింగ్​ నమోదు అయింది. 1027 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్​ ముగియడంతో హర్యానా ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో కొన్ని సంస్థలు ఎగ్జిట్​ పోల్స్​ ను ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్​ పార్టీకే హర్యానా ప్రజలు పట్టం గట్టినట్లు చెబుతున్నాయి. హర్యానా అసెం బ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది.

పీపుల్స్​ పల్స్​ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. కాంగ్రెస్​ 55, బీజేపీకి 26, ఐఎన్ఎల్డీకి 23, జేజేపీకి 01, ఇండిపెండెంట్లు 35 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాలి-.. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. 

  • రిపబ్లిక్ మ్యాట్రిజ్ఎగ్జిట్ పోల్స్:

  • కాంగ్రెస్:55–62 
  • బీజేపీ:18–26
  • జేజేపీ: 0–3
  • INLD: 3-–6
  • ఇతరులు:2–5

దైనిక్​ భాస్కర్​ఎగ్జిట్ పోల్స్​ 

  • కాంగ్రెస్:44–54 
  • బీజేపీ:19–29
  • జేజేపీ: 0–1
  • INLD: 1–5
  • ఇతరులు:4–9

CNN ఎగ్జిట్ పోల్స్:

  • కాంగ్రెస్:59 
  • బీజేపీ:21
  • జేజేపీ: 02
  • INLD: 4
  • AAP:0

Also Read :- హర్యానాలో ముగిసిన పోలింగ్..61 శాతంపైగా ఓటింగ్​

కాంగ్రెస్‌ పార్టీ తన ప్రత్యర్థి బిజెపిపై 7-8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శిస్తుందని  పీపుల్స్ పల్స్ ఎగ్జిట్​ పోల్స్​ చెబుతున్నాయి. కాంగ్రెస్ కు  45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 

పీపుల్స్​పల్స్​నిర్వహించిన సర్వేల్లో..సీఎం అభ్యర్థిగా సీఎల్పీ లీడర్​భూపీందర్ సింగ్​హుడాను కోరుకున్నారు. హుడాకు 39శాతం మంది మద్దతుపలకగా..ఆ తర్వాత సిట్టింగ్​ సీఎం నయాబ్ సింగ్​ సైనీ 28శాతం, కాంగ్రెస్​ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం,కేంద్ర మంత్రి మనోహర్ లాల్​ ఖట్టర్​ కు 6 శాతం మంది మద్దతు పలికారు. 

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్​ పోల్స్​ ప్రకారం.. హర్యానాలో ప్రధాన పోటీ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీలు  బలహీనపడ్డాయి-. ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలు కీలకపాత్ర పోషించాయి.  స్థానిక ఎమ్మెల్యే పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలు ఓటు వేశారని -పీపుల్స్ పల్స్ వెల్లడించింది.  

 ఓటర్లు జాతీయ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో  ప్రధాని మోదీ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించలేదు. నిరుద్యోగం, అగ్నీవీర్ పథకం, రైతు సమస్యలు, ధరల పెరుగుదల..హర్యానాలో  ప్రధాన సమస్యలుగా ఉన్నాయి-. పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా రాష్ట్రంలో  రైతులు, రెజ్లర్లు, యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు  పీపుల్స్ పల్స్  సర్వేలో వెల్లడయింది.