![కడెం ప్రాజెక్టుకు కొత్త గేట్లు పెట్టాలె: నిపుణులు](https://static.v6velugu.com/uploads/2023/08/Kadem-project_JKV3cogCx4.jpg)
- అదనంగా స్పిల్వే నిర్మించాలె
- గోదావరి వరద ముంపు గ్రామాలను తరలించాలె
- ఇరిగేషన్ హైలెవల్మీటింగ్లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కడెం ప్రాజెక్టును రక్షించాలంటే దానికి కొత్త గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇంకో 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా అదనపు స్పిల్వే నిర్మించాలని నిపుణులు సూచించారు. ‘గోదావరిలో వరదలు, కడెం ప్రాజెక్టు పరిస్థితి’పై మంగళవారం జలసౌధలో ఇరిగేషన్స్పెషల్సీఎస్రజత్కుమార్అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కడెం ప్రాజెక్టుపై వాసర్ల్యాబ్స్కన్సల్టెంట్డాక్టర్రామరాజు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లు ఓపెన్ చేయడానికి కనీసం 2 గంటల సమయం పడుతుండగా ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల వరద చేరడానికి కేవలం గంట వ్యవధి మాత్రమే ఉందన్నారు. ప్రాజెక్టుకు ఎగువన 70 శాతం వర్షపాతం నమోదవుతుండటమే ఇందుకు కారణమన్నారు. ప్రాజెక్టు గేట్లు 65 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో వాటిని ఓపెన్చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని మార్చాలని సూచించారు.
స్పిల్వే డిశ్చార్జి కెపాసిటీ 3 లక్షల క్యూసెక్కులే కావడంతో 1.5 లక్షల క్యూసెక్కుల నుంచి 2 లక్షల క్యూసెక్కులు వదిలేలా అదనపు స్పిల్వే ఏర్పాటు చేయాలని చెప్పారు. వరద ప్రభావాన్ని 12 గంటల ముందే అంచనా వేయడానికి డెసిషన్సపోర్ట్సిస్టం, ప్రాజెక్టుకు ఎగువన అధునాతన రివర్గేజ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశాల ఆధారంగా ప్రాజెక్టు రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని ఇంజనీర్లను రజత్కుమార్ఆదేశించారు. గోదావరిలో భారీ వరద పోటెత్తితే భద్రాచలం సమీప ప్రాంతాల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైనా మీటింగ్ లో సమీక్షించారు. 2022 సెప్టెంబర్లో ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్కమిటీ నివేదికపై నివేదికపై ఇంజనీర్ల బృందం అధ్యయనం చేసి నెల రోజుల్లోగా తుది నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, అనిల్కుమార్, నాగేందర్రావు, హరిరామ్, తదితరులు పాల్గొన్నారు.