
- సతత హరిత అరణ్యాలు 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం గల ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి పశ్చిమ కనుమలు, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తాయి. 50 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి.
- వేసవిలో భాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి తాత్కాలికంగా ఆకురాల్చే అడవుల్లోని చెట్లు ఆకులు రాల్చుతాయి.
- ఆకురాల్చే అడవులకు ఉదాహరణ సాల్ అరణ్యాలు.
- 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మైదానాల్లో 20 శాతం, పర్వతాలు, పీఠభూముల్లో 60 శాతం, దేశవ్యాప్తంగా 33 శాతం అడవులు ఉండాలి.
- 1988 రెండో జాతీయ అటవీ విధానం ప్రకారం పర్వతాలు, పీఠభూముల్లో 66శాతం, మైదానాల్లో 20శాతం, దేశవ్యాప్తంగా 33శాతం అటవీ భూములు ఉన్నాయి.
- ఆలివ్రిడ్ తాబేళ్లకు ఉత్కల్ తీరం ప్రసిద్ధి.
- ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ – 2021 ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణం 24.62శాతం. 2019తో పోలిస్తే 2021లో అడవులు, చెట్ల విస్తీర్ణం 0.28శాతం పెరిగింది.
- దేశంలో మొత్తం 140 హిల్ స్టేషన్లు ఉన్నాయి.
- దేశంలో అత్యధిక అడవుల విస్తీర్ణం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు వరుసగా దాద్రానగర్ హవేలి, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్ముకశ్మీర్.
- దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఒడిశా, చత్తీస్గఢ్, అరుణాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్.
- సామాజిక అడవుల పరిశోధన కేంద్రం అలహాబాద్లో ఉంది.
- ఉష్ణమండల సతత హరిత అరణ్యాల పరిశోధన కేంద్రం జబల్పూర్లో ఉంది.
- సర్వే ఆఫ్ ఇండియా కేంద్రం ఉదయ్పూర్లో ఉంది.
- భారతదేశంలో ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన ఆకురాల్చు అడవులు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి.
- దేశంలో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా గల రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్.
- చిత్తడి నేలల విస్తీర్ణం అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
- దేశంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, గోవా, సిక్కిం.
- కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యల్ప అటవీ విస్తీర్ణం (శాతం పరంగా) కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్.
- రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం హర్యానా.
- టెరాయి ప్రాంతంలో సబాయి గడ్డి, సలాయి గడ్డి ఎక్కువగా పెరుగుతుంది.
- భారతదేశంలో అత్యధికంగా ఆకురాల్చే అడవులు ఉన్నాయి.
- బాబుల్, బలుసు మాంగ్రూవ్ జాతికి చెందినవి.
- సాల్ వృక్షాలు శృంగాకార అరణ్యాల జాతికి చెందింది.
- దక్షిణ భారతదేశంలో పెరిగే తేమతో కూడిన సమశీతోష్ణ అరణ్యాలను షోలా అడవులు అంటారు.
- వేసవిలో ఉపయోగించే కూలర్ల తయారీలో ఉపయోగించే కుష్ కుష్ గడ్డి భరత్పూర్, గ్వాలియర్ ప్రాంతాల్లో లభిస్తుంది.
- రూసా గడ్డికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ.
- అగ్గిపుల్లల తయారీలో ప్యాకింగ్ పెట్టెల తయారీలో ఫర్ కలపను ఉపయోగిస్తారు.
- క్రికెట్ బ్యాట్ల తయారీలో విల్లోస్ కలపను ఉపయోగిస్తారు.
- హిమాద్రి పర్వత శ్రేణుల్లో ప్రధానంగా ఆల్ఫైన్ అడవులు పెరుగుతాయి.
- భారతదేశంలో మొత్తం అటవీ కార్బన్స్టాక్ 7125 మిలియన్ టన్నులు.
- భారతదేశంలో 2021 ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక ప్రకారం 75శాతం కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం
- అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవులు కలిగి ఉన్నాయి.
- ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ 2021 ప్రకారం 33శాతం కంటే తక్కువ అటవీ విస్తీర్ణం
- కలిగి రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు 18.
- దేశంలోని మొత్తం మొక్కల జాతులు 9205 కాగా, అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి.
- భారతదేశంలో రిజర్వ్ ఫారెస్ట్ 56.5శాతం.
- ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21.
- అత్యధిక లక్కను ఉత్పత్తి చేసే రాష్ట్రం జార్ఖండ్.
- అత్యధికంగా టేకును ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్.
- భారతదేశంలో అటవీ గణన మూడేండ్లకు ఒకసారి జరుగుతుంది.
- 2012 భారత అటవీ నివేదిక 17వది.
- భారతదేశంలో తొలి అటవీ నివేదిక 1987లో ప్రచురించారు.
- దేశంలో అత్యధికంగా ట్రీ కవర్ మహారాష్ట్ర కలిగి ఉంది.
- దేశంలో అత్యధికంగా చెట్ల విస్తీర్ణం కలిగి కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్.