హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఈ నెల 6 దాకా అప్లై చేసుకోవచ్చని ఎస్సీ గురుకులాల సెక్రటరీ, ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ అలుగు వర్షిణి తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారంతో గడువు ముగియగా, మరో 6 రోజులు పొడిగించినట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వరుసగా సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. గురుకులాల్లో అడ్మిషన్లు పెంచేందుకు రాష్ర్ట వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రచార రథాల ద్వారా క్యాంపెయినింగ్చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 51,968 సీట్లు ఉండగా, శనివారం వరకు 1,46,394 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో కేవలం ఐదో తరగతిలో అడ్మిషన్ల కోసమే 81,305 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.