
గద్వాల, వెలుగు: ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేందుకు మరో రెండు రోజుల పాటు గడువు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఐడీవోసీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో ఈ నెల 10 వరకు పోస్టల్ బ్యాలెట్ను అందించవచ్చని తెలిపారు.