తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను తెలంగాణ భవన్ ముందు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి విభాగం నేతలకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ లీడర్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారం స్టేట్ పాలిటిక్స్‎లో కాక రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంతో  కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. 

Also Read :- నిమజ్జనం తర్వాత చూసుకుందాం