ఒక్క చార్జ్​తో 320 కిలోమీటర్లు

ఒక్క చార్జ్​తో 320 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్​ స్పోర్ట్స్​లగ్జరీ బైకులు తయారు చేసే అల్ట్రా వయొలెట్​ హైదరాబాద్‌లో ఎఫ్ 77 మాక్ 2 ఎలక్ట్రిక్​ బైక్​ను లాంచ్​ చేసింది.  ఇందులో 10.3 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్​ చేస్తే 320 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్​ స్పీడ్​ 155 కిలోమీటర్లు. దీనిపై ఎనిమిది లక్షల కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. ధర రూ.మూడు లక్షలు.  

ఈ సందర్భంగా సంస్థ యూవీ స్పేస్ స్టేషన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ కేంద్రాన్ని ప్రారంభించింది.  2024 దీపావళి నాటికి 10 నగరాల్లో 50 ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.