హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్ లో కొనసాగుతున్న మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్ వచ్చే బుధవారం ఉంటుందని పీసీసీ వర్గాలు ప్రకటించాయి. వివిధ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురావాలనుకున్న ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చే బుధవారం గాంధీభవన్ కు రావాలని రాష్ట్ర కాంగ్రెస్ సూచించింది.
పీసీసీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఈ ప్రోగ్రామ్ ను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ బుధవారానికి వాయిదా వేసింది.