
ఫేస్బుక్కు అమెరికా నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది. వినియోగదారుల వ్యక్తిగత భద్రత వైఫల్యాలపై దర్యాప్తును ఎదుర్కొంటున్న ఫేస్బుక్కు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇంత భారీ స్థాయిలో జరిమానా విధించింది. దర్యాప్తు సెటిల్మెంట్లో భాగంగా ఫేస్బుక్ 5 బిలియన్ డాలర్లు(అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 34వేల కోట్లు) చెల్లించేందుకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ 32 ఓట్లతో అంగీకరించింది. దీనికి సంబంధించి వాల్ స్ట్రీట్ జర్నల్ లో తెలిపింది. అయితే ఇంత భారీ స్థాయిలో జరిమానా విధించడం ఇదే మొదటి సారి. ఈ సెటిల్మెంట్ను అమెరికా న్యాయశాఖ అంగీకరించాల్సి ఉంది.