
ఘట్కేసర్, వెలుగు: క్షుద్రపూజలు చేస్తమని రూ. లక్షల్లో తీసుకుని పాత నేరస్తులు అరెస్టయ్యారు. ఘట్ కేసర్ పీఎస్ పరిధిలోని ఎదులాబాద్లో ఉండే రాజు వద్దకు గత నెల11న మాతం చందు, ఎర్నాల సంజీవ్ వెళ్లి ఇంట్లో దయ్యాలు ఉన్నాయని, క్షుద్రపూజలు చేయకపోతే చనిపోతావని భయపెట్టడమే కాకుండా ఇంటి కింద కోట్ల విలువైన గుప్తనిధులు ఉన్నాయని వాటిని బయటికి తీస్తామని నమ్మించి రూ. 7 లక్షల తీసుకుని పారిపోయారు. బాధితుడు పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. రామన్నపేట పీఎస్ పరిధిలో రేప్ కేసులో నిందితులైన కరీంనగర్ జిల్లాకు చెందిన చందు, సంజీవ్ గా గుర్తించి భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 15 వేల నగదు , 2 సెల్ ఫోన్లు , ఆల్టో కారు , పూజా సామగ్రిని స్వాధీనం చేసుకుని ఆదివారం రిమాండ్ కు తరలించారు.