వన్ పోలీస్ వన్ రూల్ అమలు చేయండి..

వన్ పోలీస్ వన్ రూల్ అమలు చేయండి..

డిచ్​పల్లి :  ప్రభుత్వం వన్​ పోలీస్ ​వన్​ రూల్​ను అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ   నేషనల్​హైవే 44పై  డిచ్​పల్లి 7వ బెటాలియన్​ పోలీసుల భార్యలు ధర్నాకు దిగారు.  పోలీస్​డ్యూటీలో తమ భర్తలను వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు, కర్ణాటక పోలీసు విధానాన్ని అనుసరించాలని డిమాండ్​ చేశారు. 

  ధర్నాకు మాజీ మంత్రి కేటీఆర్ సంఘీభావం తెలిపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్​జామ్​అయింది.  ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోని, ట్రాఫిక్​ను క్లియర్​ చేస్తున్నారు.