
జీడిమెట్ల, వెలుగు: రోడ్డు ప్రమాదంలో యువకుడి బ్రేన్ డెడ్కావడంతో అవయవదానానికి బాధిత కుటుంబం ముందుకొచ్చింది. కొంపల్లిలోని గంగా ఎన్క్లేవ్ రాయల్నెస్ట్ అపార్ట్మెంట్కు చెందిన ఉప్పు సుబ్బారావు సీఏగా పనిచేస్తున్నాడు. ఆయన కొడుకు సాయి సుబ్రహ్మణ్యం(20) బీటెక్ లాస్టియర్ చదువుతున్నాడు.
రోజు మాదిరిగానే ఈ నెల 4న వ్యాయామం చేయడానికి స్కూటీపై వెళ్తూ.. సేయింట్ఆన్స్స్కూల్ వద్ద మరో స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హెల్మెంట్ లేకపోవడంతో సాయి సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, బ్రెన్డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
దీంతో పుట్టెడు బాధను దిగమింగి తన కొడుకు అవయవాలను దానం చేయడానికి ఆ కుటుంబసభ్యులు ముందుకొచ్చారు.